ఆ. వె. మృగము వేటయాడు ఖగము ఎగురుచుండు నీరు పారునోయి నిప్పు రగులు మార్పుయన్న గుణము మనిషికేనుగలదు ఆలకించవోయి అవని సుతుడ **************************** భావము: మృగము వేటాడుతుంది, పక్షి ఎగురుతుంది, నీరు పారుతుంది, నిప్పు రగులుతుంది. ఇవి వాటి స్వభావాన్ని మార్చుకోలేవు. మనిషికి మాత్రమే తన స్వభావాన్ని మర్చుకోగల శక్తి ఉంది అని